కష్టాల సుడిగుండంలో ఎదురీదుతున తెలుగుదేశం పార్టీకి కాంతికిరణం కనిపించింది.చాలా రోజుల తర్వాత టిడిపిలో జోష్ వెల్లువెత్తింది. ఈ మధ్యకాలంలో టీడీపీకి అన్నీఆటుపోట్లే. వైసీపీ ధాటికి టిడిపి తట్టుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది.
పార్టీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్టులు టిడిపిని కుదిపేశాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం వల్లభనేని వంశీ మద్దాలి గిరి వైసీపీ వైపు వెళ్లిపోయారు. ఇలా ఎటువైపు చూసినా అన్ని అపశకునాలు లతో టీడీపీ కుదేలు అయిపోయిన నేపథ్యంలో ఆ పార్టీకి హుషారు తెప్పించే సంఘటన జరిగింది విషయమేమిట౦టే కేంద్ర హోంశాఖ మంత్రి ,బిజెపిలో నెంబర్ టూ అమిత్ షా ఇటీవల కరోనా బారిన పడ్డారు.ఈమధ్య కోలుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు నేరుగా ఫోన్ చేశారు. కరోనా నుండి కోలుకునందుకు అభినందనలు తెలిపారు.
అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ కు స్పందించి చక్కటి జవాబులిచ్చారు.దీంతో టిడిపి వర్గాల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.ఎందుకంటే బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు నాయుడు చాలా తీవ్ర స్థాయిలో ప్రధాని మోడీని ఆ పార్టీని దుయ్యబట్టి శత్రుత్వం బాగా పెంచుకున్నారు.అసలు ప్రధాని మోడీకి ఎసరు పెట్టే రీతిలో ఆయనొక ఫ్రంటును కూడా ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసిన విషయం తెలిసిందే .ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ తిరుగులేని విజయం సాధించారు చంద్రబాబు ఘోర పరాజయం చెందాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అప్పటి నుంచి కూడా మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరికి కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లడానికి అనుమతి అడిగే సాకుతో కూడా ట్రై చేశారు. అయినా కూడా హస్తిన నుంచి బాబు స్పందన కరువైంది. అలాంటి బాబుకు ఇప్పుడు అమిత్ షా ఫోన్ లో రెస్పాండ్ కావడం నిజంగా విశేషమే అంటున్నారు.దీంతో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు.