Fellowship : ఐఐఎం బెంగళూరు, భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ తో కలిసి 2021 – 2023 విద్యా సంవత్సరానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ Mahatma Gandhi National Fellowship నోటిఫికేషన్ విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా 9 ఐఐఎం లకు ఐఐఎం బెంగళూరు ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తోంది.. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం ఉదయపూర్, ఐఐఎం నాగపూర్, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం జమ్ము, ఐఐఎం రాంచీ, ఐఐఎం లఖన్ వూ ఆతిధ్యం ఇస్తున్నాయి.. ఈ ఫెలోషిప్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ 2021-2023 :
అర్హతలు : గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉతీర్ణత సాధించి ఉండాలి. 0-3 సంవత్సరాల పని అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యత ఇస్తారు. లోకల్ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు : 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా
పరీక్షా విధానం : ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
స్టైఫండ్ :
1. మొదటి సంవత్సరం : నెలకు రూ. 50,000 ను ఇస్తారు.
2. రెండో సంవత్సరం : నెలకు రూ. 60,000 ను ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 27/3/2021
వెబ్ సైట్ : https://www.iimb.ac.in/mgnf/