బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. బంగారు ఆభరణాలు అంటే మగువలకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. పెళ్లిళ్ళు, పెరంటాలలో బంగారు అభరణాలకు ఉన్న స్పెషాలిటినే వేరు. ఆర్ధికంగా ఉన్న వారు అయిన, మధ్య తరగతి వారైనా వారి తహాతను బట్టి పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో బంగారం కు ఉన్న విలువే వేరు. బంగారం పై పెట్టుబడులు పెట్టెవారు ఎక్కువే, అభరణాలు కోనే వారు ఎక్కువే.
పండగలు వస్తున్నాయి. పండగ సీజన్ లో బంగారం కొనుగోళ్ళు కూడా పెరుగుతాయి. నిన్న మొన్నటి వరకు చెట్టెక్కిన పసిడి ధరలు గత కొద్ది రోజులుగా కుంచం కుంచం గా దిగి వస్తున్నాయి. బంగారంపై మోజు ఉన్న వారికి, బంగారం పై పెట్టుబడులు పెట్టెవారికి ఇది కొంత ఊరట నిచ్చే విషయం. మార్చి నెలలో పది గ్రాముల బంగారం ధర 40 వేల లోపు ఉండేది. అది కాస్త కరోనా వలన లేక అంతర్జాతీయంగా వచ్చిన మార్పు ల వలనో కాని బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆగష్టు నెలలో అయితే 56 వేల పై చిలుకే పలికింది. ఆ ధరలను చూసి మధ్యతరగతి కుంటుంబాల కు చెందిన మహిళలు చాలా నిరాశకు గురైనారు. ఇంత ధరలలో బంగారం కోనడం మనకు సాధ్యం అయ్యే పని కాదు. బంగారం పై ఆశలు చంపుకోవాల్సిందే అనే ఆలోచనకు వచ్చేశారు.
ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. దీంతో పసిడిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరి ఆశలు చిగురిస్తున్నాయి. కాస్తో కూస్తో దాచుకున్న నగదుతో బంగారం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. . ముఖ్యంగా దీపావళికి భారతదేశంలో బంగారం కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపధ్యంలో వ్యాక్సిన్ రాకుంటే ధరలు పెరుగుతాయని, వ్యాక్సిన్ వస్తే మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ తరుణంలో దిపావళి పండగ నాటికి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పసిడి పెట్టుబడి పెట్టె నిపుణులు తెలియజేస్తున్నారు