విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది.
వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది.
పొని తుపాను ప్రస్తుతం చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృమైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరో 24 గంటల్లో మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
ఈ నెల 30న ఫొని తన దిశను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంటే 200 నుంచి 300 కి.మీ.దూరంలో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయనీ, ఒడిశా తీరానికి కాస్త దగ్గరగా వెళ్లి బంగ్లాదేశ్ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నాయి.
ఈ నెల 29, 30 తేదీల్లో కేరళలో భారీ నుంచి తేలికపాటి వర్షాలుంటాయని.. తమిళనాడు, కోస్తాంధ్రలో ఏప్రిల్ 30, మే ఒకటిన పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో 80 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. ఈ వేగం 90-115 కి.మీ.కు పెరుగుతుందని తెలిపారు. ఈ నెల 29నాటికి 145 నుంచి 170 కి.మీ.కు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ గాలుల ప్రభావం 30వ తేదీ రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంగా వేగం తగ్గుతుందని చెబుతున్నారు.
మే రెండవ తేదీకి ఆంధ్రప్రదేశ్ తీరంలో గాలుల వేగం గంటకు 125-150 కి.మీ.ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని, మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.
విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగరేసినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?