గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా సిబ్బంది వాహనాన్ని నక్సల్స్ పేల్చవేయడంతో 15మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు.
24గంటల వ్యవధిలోనే నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి దాదాపూర్లో 36 వాహనాలకు నిప్పు పెట్టారు. దానిపై దర్యాప్తునకు సి60 క్విక్ రెస్పాన్స్ టీం సభ్యులు ఒక ప్రయివేటు వాహనంలో వెళుతుండగా దానిని నక్సల్స్ పేల్చివేశారు. ఈ ఘటనలో వాహనం డ్రయివర్ కూడా మృతి చెందాడు. గడ్చిరోలి, జంబూంపడ గ్రామం వద్ద ఈ సంఘటన సంభవించింది.
పేలుడుకు మావోయిస్టులు ఇఐడిని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం నక్సలైట్లు అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో భధ్రతాదళాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియరాలేదు.