Money : ఒక పిడికెడు తెల్ల నువ్వులను కలిపి,
ధన ప్రాప్తి కలుగడం కోసం శుక్రవారం పరిహారం గురించి తెలుసుకుందాం.. ఇది చాలా సులభమైన 5 నిమిషాలో చేసుకోగలిగే తంత్ర ప్రయోగం. కాబట్టి మీరు ప్రతి శుక్రవారంచేయవలిసి ఉంటుంది. ఈ తంత్ర ప్రయోగాన్ని చేసుకోవటానికి కచ్చితమైన సమయం అంటూ ఏమి లేదు కాబట్టి మీకు వీలు కలిగిన ప్రతి శుక్రవారం రోజు ఈ ప్రయోగాన్ని చేసుకుని శ్రీ మహా లక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని చాలా తేలికగా పొందవచ్చు.
ఈ తంత్ర ప్రయోగం చేసుకోవడానికి శుక్రవారాల ఉదయం సమయంలో రాగి , ఇత్తడి లేదా ఇనుప పాత్ర లో మంచి నీటిని నింపుకుని ఆ నీటిలో ఒక పిడికెడు తెల్ల నువ్వులను కలిపి, నువ్వులు కలిపిన ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి. రావి చెట్టుకు నీటిని పోస్తున్నప్పుడు ” ఓం చైతన్య అశ్వత్థాయ శరణం మమ ” మంత్రాన్ని కేవలం ఒక్క సారి మాత్రమే చెప్పుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ కూడా చేయక్కరలేదు. ఇక మీరు చేయాల్సిందల్లా తెల్ల నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టుకు పోసి ,కేవలం ఒక సారి మంత్రాన్ని జపించి, మంచి ఆదాయాన్ని, ధన ప్రాప్తి ని ప్రసాదించమని రావి చెట్టును అభ్యర్థిస్తూ రావి చెట్టుకు ప్రార్ధన చేసి వచ్చేయాలి. శ్రీ మహా విష్ణువు, శ్రీ మహా లక్ష్మి దేవి అనుగ్రహంతో ఈ తంత్ర ప్రయోగం మీకు చక్కని ఆదాయాన్ని, ధన ప్రాప్తిని ప్రసాదిస్తుంది.
Money : ఏదైనా లక్ష్మీ మంత్రం
మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అంటే మీ వ్యాపార స్థలంలో కాస్త ఆవు పేడ తీసుకుని .. ఆ పేడతో చిన్నగా అలికి, పసుపుతో త్రికోణము వేసుకుని , దానిపై ఆసనము వేసి కూర్చుని, ఏదైనా లక్ష్మీ మంత్రం ఒకటి తీసుకుని 15 నిమిషాల పాటు స్మరిస్తూ ఉండడం వల్ల మీ వ్యాపారం లో చక్కని అభివృద్ది కనిపిస్తుంది. మీ పరిస్థితి చక్కబడేవరకు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.