విశ్రాంతికి సమయం కరువైంది. నిద్రలేక కొందరు బాధపడుతుంటే.. నిద్రపోవటానికి సమయం లేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే గాఢమైన నిద్రకు ప్రస్తుతం టెక్ యుగం ఆటంకంగా మారుతుంది. నిద్రకు కూడా సమయం లేకుండా చాలామంది స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా లో కాలం గడిపేస్తున్నారు.టైమ్కి నిద్రపోతే ఉదయం త్వరగా మేల్కోగలం.నిద్రపోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి.కంటినిండా నిద్ర లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అంతేకాదు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం చేసే వృత్తికి ఎంత ప్రాధాన్యం ఇస్తామొ అలాగే నిద్ర కూడా ఇవ్వాలి.
ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. తక్కువ నిద్రపోతే భవిష్యత్తులో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. సంతానోత్పత్తి కి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. భోజనం చేసిన తరువాత రెండు గంటల హాయిగా నిద్ర పోవాలి. నేటితరం యువత గేమ్స్ ఆడుతూ, వెబ్ సిరీస్ చూస్తూ ఫోన్లలోనే ఎక్కువ కాలక్షేపం చేస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారు భవిష్యత్తులో మధుమేహానికి గురయ్యే అవాకారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. యుక్తవయసులో సరైన నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ సామర్థ్యం కోల్పోతుంది. అంతే కాకుండా రోగ నిరోధక సమస్యలు ఏర్పడుతాయి. వివిధ ఇన్ఫెక్షన్లకు గురికావడం.., చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. కాబట్టి ఇ స్మార్ట్ ఫోన్ ల తో కాలక్షేపం చేయకుండా సంతోషంగా నిద్రపోండి ఆ నిద్రను ఎంజాయ్ చేయండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?