వాతావరణంలో మార్పులు రావటంతో పైగా చలికాలం కావడంతో వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఉన్న కొద్ది పెరిగిపోతోంది. అమెరికా అదేవిధంగా యూరప్ దేశాలు గజగజ లాడుతున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే రెండో దఫా లాక్ డౌన్ విధించాయి. పరిస్థితి ఇలా ఉండగా ఇండియాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో కేంద్రంలో టెన్షన్ నెలకొంది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య ఉన్న కొద్దీ పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు కఠిన నిబంధనలు విధించింది. మేటర్ లోకి వెళ్తే ఎవరైనా ఇల్లు దాటి బయటకు అడుగు పెడితే మాస్క్ లేకుండా కనబడితే రెండు వేల రూపాయలు ఫైన్ కట్టాలని సరికొత్త ఆదేశాలు ఇచ్చింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ వచ్చేసినట్టు వైద్య నిపుణులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ప్రజల ఆరోగ్య నిమిత్తం ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ముఖ్యంగా కేసులు పెరగడానికి కారణం ఇటీవల దసరా దీపావళి పండుగ వరుసగా రావడంతో పాటు ప్రజలలో కరోనా భయం తగ్గి కనీసం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించక పోవడం వల్లే కేసు తీవ్రత పెరిగినట్లు వైద్యులు భావిస్తున్నారు. అదేవిధంగా పండుగలు పిల్లల్లో జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో వద్దు అని ఖచ్చితంగా మాస్కులు ధరించి బయటకు రావాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?