హైదరాబాద్: మాదాపూర్లోని నోవాటెల్ పబ్లో పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశీష్ గౌడ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సినీనటి, బిగ్బాస్ ఫేమ్ సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆశీష్ గౌడ్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, బూతులు తిట్టాడనీ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశీష్ గౌడ్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడనీ అడ్డువచ్చినవారిపైనా అతని స్నేహితులు దాడి చేశారనీ తెలిపింది.
సంజన ఫిర్యాదుపై అశీష్ గౌడ్తో పాటు అతని స్నేహితులపైన మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్ లోపల, బయట ఉన్న సిసి టివీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.