ముంబయి: ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంటిఎన్ఎల్ టెలిఫోన్ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిది అంతస్తులున్న ఈ భవనంలో మూడు, నాలుగు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. సుమారు వంద మందికి పైగా కార్యాలయ సిబ్బంది భవనం పై కప్పుమీద చిక్కుకున్నట్లు సమాచారం. 14 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలంలో మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
మహరాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తెలిపిన నివేదిక ప్రకారం పదేళ్ల కాలంలో ముంబయిలో 49వేలకు పైగా అగ్నిప్రమాదాలు జరగ్గా 600మందికి పైగా మృతి చెందారు.