రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజమండ్రి కుమార్ టాకీస్ సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదం విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ లో కస్టమర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తొంది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు పరుగులు తీసారు.
మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది రక్షిస్తున్నారు. మంటల్లో పలువురు వృద్దులు చిక్కుకోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది.ఎంత ఆస్తినష్టం జరిగింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.