విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్ -2లో ద్రవ ఉక్కుతో ఉన్న లాటిన్ జారిపడటంతో అది నేలపాలు అయ్యింది. ఉక్కుపడిన ప్రదేశంలో ఆయిల్ ఉండటంతో ఒక్క సారిగా మంటలు లేచాయి. దీంతో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే సంస్థ అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సకాలంలో స్పందించడం వల్ల ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. పెను ప్రమాదం తప్పడంతో కార్మికులు, అధికారులు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.