(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రాపురం గ్రామంలో గల శ్రీచక్ర ఆయిల్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఫ్యాక్టరీలో వంద మందికి పైగా కార్మికులు పని చేస్తుండగా బుధవారం కార్మికులు రాకముందే అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీ నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిందని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తును కొనసాగిస్తన్నారు.