తెలంగాణలో ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు, దుకాణాలు కాకుండా కార్లు, ఆర్టీసీ బస్సులు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి. రీసెంట్ గా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై 48 గంటల వ్యవధిలో రెండు ఏసీ బస్సులు అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. తాజాగా హైదరాబాద్ నగరంలో రోడ్డు పై వెళుతున్న బస్సులో ఒక్క సారిగా మంటలు చెలరేగడం జరిగింది. బస్సులో నుండి మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు, పొగలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సు ఆపి వెంటనే ప్రయాణీకులను కిందకు దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
రన్నింగ్ బస్సులో మంటలు ఎగిసిపడటం చూసి వాహనదారులు ఆందోళన చెందారు. శంషాబాద్ నుండి జేబీఎస్ కు బేగంపేట్ మీదుగా వెళుతున్న టీఎస్ ఆర్టీసీ ఎలక్టిక్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. బస్సుపై భాగంలో ఉన్న ఏసీ నుండి మంటలు చెలరేగడం వాహనచోదకులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. అనంతరం ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా బస్సు ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ప్రయాణీకులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపారు.
Bandi Sanjay: ‘యతో ధర్మస్తతో జయః’ .. జైలు నుండి విడుదలైన తర్వాత బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్