(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రయాణికులంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలకుగండా యధావిధిగా కొనసాగిస్తున్నారు.