న్యూఢిల్లీ – భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు బోగి నుండి మంటలు చెలరేగాయి. ఒడిషాలోని రూర్కెలా స్టేషన్ సమీపంలో తిలక్నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని బి ఏడు నెంబరు బోగి నుండి పొగలు వెలువడ్డాయి. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
మూడు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రయాణీకులను ఇతర బోగీలకు తరలించారు. విద్యుదాఘాతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.