(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీపోటులో అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బూందీ తయారు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదంతో లడ్దూ తయారీ నిలిచిపోయింది. ఆప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గతంలో చాలా సార్లు బూందీపోటులో ప్రమాదాలు జరిగాయి. అయితే ఇక్కడ నిత్యం లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తుంటారు.