దశాబ్దకాలంగా రవాణా విషయంలో దేశ ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను ఇండియన్ రైల్వేస్ అందిస్తుంది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించే యోచనలో భాగంగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతుంది. గంటకు వందల కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గిపోనుంది. కేంద్ర ప్రభుత్వం, హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా దీన్నిరూపకల్పన చేసారు.
కరోనా కారణంగా తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ (ముంబై-అహ్మదాబాద్) పనులు కొంత ఆలస్యం అయినప్పటికే, ఇండియాలో మొదటి బుల్లెట్ ట్రైన్ టెండర్ ఖరారు అయింది. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం “ఎల్ అండ్ టి” 7289 కోట్ల రూపాయల టెండరును కైవసం చేసుకుంది. 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు లో భాగం అయినా 88 కిలోమీటర్ల విస్తీర్ణ వయాడక్ట్ రూపకల్పన అలాగే నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ టెండర్లను (బిడ్లు) ఆహ్వానించింది. ఈ టెండర్లలో అత్యల్ప బిడ్డర్ గా మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ & టౌబ్రో నిలిచింది. ఏడు ప్రధాన భారతీయ మౌలిక సదుపాయాల కంపెనీలతో కూడిన మొత్తం ముగ్గురు బిడ్డర్లు పోటీ బిడ్డింగ్లో పాల్గొన్నారు. అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జెఎంసి ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్- రూ .12,697.08 కోట్లుతో టెండర్ వేయగా, ఎన్సిసి లిమిటెడ్ టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్. – జె. కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ – హెచ్ఎస్ఆర్ కన్సార్టియం రూ. 9837.89 కోట్లుతో టెండరును దాఖలు చేసింది. ఈ టెండర్ కోసం సాంకేతిక బిడ్లను సెప్టెంబర్ 25, 2020 న ప్రారంభించారు.
ఈ టెండర్ పరిధిలో ప్యాకేజీ సి6 401.898 నుండి 489.467 వరకు మొత్తం లైన్ యొక్క మూడవ పొడవైన ప్యాకేజీ మరియు వడోదరను అహ్మదాబాద్తో ఒక స్టేషన్ ద్వారా మరియు ఆనంద్-నాడియాడ్ వద్ద ఒక చిన్న డిపో ద్వారా కలుపుతుంది. అలాగే సివిల్ బిల్డింగ్ వర్క్స్ యొక్క డిజైన్,నిర్మాణం ఉన్నాయి, వీటిలో డబుల్ హై స్పీడ్ రైల్వే కోసం వయాడక్ట్ & బ్రిడ్జెస్, క్రాసింగ్ బ్రిడ్జెస్, మెయింటెనెన్స్ డిపో స్టేషన్లు ఉన్నాయి. అలాగే గుజరాత్లోని వాపి మరియు వడోదర మధ్య 237 కిలోమీటర్ల వయాడక్ట్ కోసం ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ ఇప్పటికే లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్ సంస్థ పని మొదలుపెటింది. వాటిలో నాలుగు ఎత్తైన హైస్పీడ్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అవి వాపి, బిల్లిమోరా, సూరత్ ,భరూచ్ అలాగే సూరత్ వద్ద ఒక రైలు డిపో.
ఇది కాకుండా మరో 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ల ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గుర్తించింది. ముంబై – పుణే – హైదరాబాద్తో పాటు ఢిల్లీ – లక్నో – వారణాసి, ముంబై – నాసిక్ - నాగపూర్, ఢిల్లీ – జబల్పూర్ - అహ్మదాబాద్, చెన్నై – మైసూర్, ఢిల్లీ – చండీగఢ్ - అమృత్సర్, వారణాసి – పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలోని ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను తయారు చేసే బాధ్యతను ఇప్పటికే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు అప్పగించింది ఇండియన్ రైల్వేస్. బుల్లెట్ ట్రైన కారిడార్లు ప్రారంభమైతే, ప్రతిపాదిత నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాపార, వాణిజ్యం మరింతగా పెరిగే అవకాశముంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?