చిత్తూరు: అపోలో టైర్స్ ఏపీ యూనిట్ లో తొలి టైర్ విడుదల. చిత్తూరులో 2018లో ఏర్పాటైన అపోలో టైర్స్ పరిశ్రమ. వర్చువల్ సమావేశంలో తొలి టైర్ విడుదల చేసిన సంస్థ చైర్మన్. తొలిదశలో రూ.3800 కోట్లతో పెట్టుబడి పెట్టిన అపోలో టైర్స్ సంస్థ. ఈ పరిశ్రమ 2018 జనవరిలో ప్రారంభమైంది. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. నెలకు 5వేల టైర్స్ ఉత్తత్తే లక్ష్యంగా ఈ పరిశ్రమ ప్రారంభమైంది. బస్సులు, ట్రక్కుల కోసం రేడియల్ టైర్లను, ద్విచక్ర వాహనాల టైర్లను తయారు చేసేందుకు ఇక్కడ ప్లాంట్ నెలకొల్పారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది.
previous post