పుణె(మహరాష్ట్ర): పుణె జిల్లా ఉరులీ దేహచిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉరులీ దేహచిలోని వస్త్రదుకాణంలో తెల్లవారుజామున మంటలు చేలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేశారు.
పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.