“మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా… నా లక్ష్యం జనం హృదయాల్లో సుస్థిర స్థానం.. సువర్ణాక్షర లిఖిత పాలనే ధ్యేయం” అంటూ ముందుకుసాగుతున్నారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! తాను అనుకున్నది ఎంత కష్టమైన పనైనా.. ఇచ్చిన మాట ఎంత క్లిష్టపరిస్థితుల్లో అయినా నిలబెట్టుకోవాలి.. చేసుకుంటూపోవాలి అనేది ఆయన నైజం అనే విషయం గత పదేళ్లలో రుజువైందనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో తాజాగా జగన్ చేసిన ఒక పనికి… దేశవ్యాప్తంగా ప్రశంసలు.. జగన్ గట్స్ కి సెల్యూట్ లు అందుతున్నాయి!!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో స్టెరీన్ గ్యాస్ లీక్ అవడంతో ఆ పరిశ్రమ చుట్టు ఉన్న అయిదు గ్రామాల ప్రజలు వణికిపోయారు. సుమారు పదిహేనుమంది మరణించారు! ఈ దుర్ఘటన తరువాత జగన్ స్పందించిన తీరు దేశంలోనే ఒక స్పూర్తిగా ఉందనే కామెంట్లు వినిపించాయి. ఒక్కో మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించడం దగ్గరనుంచి ఆ ఘటనపై విచారణ జరిపించడం వరకూ జగన్ చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లారు. ఈ ఉదారతను హైకోర్టు కూడా అభినందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో జగన్ కుమ్మక్కాయారని, బేరాలు ఆడుకుంటున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేశారు. జగన్ వాటిని పట్టించుకోకుండా… విచారణ జరిపించారు.. 12మందిని అరెస్టు చేశారు! ఇదంతా ఒకెత్తు అయితే… ఆ అరెస్టు అయినవారిలో విదేశీయుడైన సీఈవో కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్ ఉండటం కొసమెరుపు! ఇప్పుడు ఇదే జగన్ ని దేశవ్యాప్తంగా హీరోని చేసింది.. ఊహించని రిజల్ట్ ని కట్టబెట్టింది.
ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ సౌత్ కొరియా దేశానికి చెందినది అవ్వడంతో జగన్ సైలంట్ అయిపోతారని అంతా భావించారు. కారణం… సౌత్ కొరియాకూ – భారత్ కు మధ్య మంచి సంబంధలే ఉన్నాయి. ఇటువంటి సంస్థకు చెందిన ఒక విదేశీ సీఈవోను అరెస్ట్ చేయాలంటే డేరింగ్ ఉండాలి.. గట్స్ ఉండాలి. అవి రెండూ పుష్కలంగా ఉన్న జగన్.. జనానికి ఇచ్చిన మాటమేరకు విచారణ జరిపించారు.. సీఈవో కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్ తో సహా 12 మందిని శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు! ఫలితంగా విదేశీ పారిశ్రామికవేత్తలకు భయం భక్తి ఉండేలా.. ఇలాంటి ప్రమాదాలు దేశంలో మళ్లీ ఎక్కడా జరగకుండా జాగ్రత్త పడేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?