జకార్తా: ఇండోనేషియాలో వరదలు విరుచుకుపడటంతో 50 మందికి పైగా మరణించారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పపువా రాష్ట్ర రాజధాని జయపుర సమీపంలోని సెంటని ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా కుండపోత వర్షాలు కురిశాయి. ఆ వెంటనే మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దాంతో 50 మంది మరణించగా మరో 59 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలియజేస్తున్నారు.
డజన్ల కొద్దీ ఇళ్లు, రెండు వంతెనలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రొహొ తెలిపారు. ఇప్పటికీ ఇంకా సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, బాధితులు ఎంతమంది అన్న విషయం చెప్పలేమని ఆయన అన్నారు. వరద తగ్గిన తర్వాత గానీ మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదని చెప్పారు. గాలింపు బృందాలు ఇంకా ఘటనాస్థలానికి చేరుకోలేకపోయాయి. వరదలు వచ్చిన ప్రదేశం నుంచి నీరు వెళ్లిపోగా.. బురద, మట్టి, చెత్త వంటివి భారీగా వచ్చాయి. ఈ వరదల కారణంగా 120 వరకు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.
Banjir landa Sentani Kabupaten Jayapura, Papua. Banjir di Gunung Merah membawa debit banjir dan kayu-kayu. Hati-hati bahaya kesetrum listrik. Jangan memegang tiang listrik dalam basah atau perabotan rumah yang masih menyala dan terendam banjir. Semoga korban tidak bertambah. pic.twitter.com/1Pk2GOYoDb
— Sutopo Purwo Nugroho (@Sutopo_PN) March 16, 2019