మామూలుగా మనం ఓ నలుగురు నవ్వించడానికి నాన్న తంటాలు పడతాం.. బ్రహ్మానందం మాత్రం తన నటనతో కొన్ని కోట్ల మందిని నవ్విస్తున్నారు… ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ విధంగా ఆయన సుమారు వెయ్యి సినిమాలకు పైగా నటించి, అన్నింటిలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనందుడు.. రెండు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఒక ఊపు ఊపిన కామెడీ కింగ్.. ఆయన వెండి తెర మీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు.. బట్టతల తో ఎంట్రీ ఇచ్చి క్లాస్ , మాస్ బాల్కనీ, నేల టికెట్ అనే తేడా లేకుండా అందరితో విజిల్స్ వేయించే స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మన బ్రహ్మీ నే.. కామెడీ విషయంలో బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగిలే ఉంటుంది.. టాలీవుడ్ బ్రహ్మానందం అంటే బ్రాండ్ గా మారిపోయారు.. ఎంతలా అంటే ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ బ్రహ్మానందం హాస్య ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేశారు.. ఈ ఫోటో ఎందుకు ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారో.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరోసారి నిలబెట్టేందుకు భారత జట్టు ఆడుతుంది.. రెండేళ్లక్రితం భారత్ తన సొంత గడ్డపైనే తనని ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ భారత్ మధ్య హోరాహోరీ జరుగుతుంది.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ ఈరోజు మూడవ సీజన్ జరగవలసి ఉంది.. అయితే ప్రకృతి పులకరించి వాన పడింది.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చోలే అమండా బెయిలీ బ్రహ్మానందం హాస్య ఫోటో తో తన ట్విట్టర్ అకౌంట్లో ఎస్సీజీ వద్ద ఇప్పటికీ వర్షం పడుతుంది అంటూ పోస్ట్ చేశారు.. సాధారణంగా హాస్య బ్రహ్మానందం గురించి ఇండియా వరకే తెలిసిన ఆయనను ఆస్ట్రేలియా దేశంలో కూడా తెలియజేయడం గొప్పే కదా..
It is still raining here at the SCG. It looks set in too!
Me looking at my weather friends who said it won’t rain enough to affect play:
???? #AUSvIND pic.twitter.com/FUJooncXlf
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) January 7, 2021