Flight Missing: నేపాల్ లో ఓ విమానం ఆచూకీ గల్లంతు అయ్యింది. పొఖారా నుండి జామ్ సొమ్ బయలుదేరిన తారా ఎయిర్స్ లైన్స్ 9 ఎన్ ఏ ఈటీ ట్వీన్ ఇంజిన్ విమానానికి ఉదయం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో ఏటీసీ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ప్రయాణీకులు ఉన్నట్లు నేపాల్ అధికారిక మీడియా తెలిపింది. గల్లంతైన విమానంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ వాసులు ఉండగా, మిగిలిన వారు నేపాల్ పౌరులు ఉన్నారు.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విమానం ముస్తాంగ్ ప్రాంతంలోని జామ్ సోమ్ లో గాల్లో ఉండగా చివరిసారిగా కనిపించిందనీ, తర్వాత దాన్ని దౌలగిరి పర్వతం వైపు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. రెండు హెలికాఫ్టర్ లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ముస్తాంగ్ జిల్లా డీఎస్పీ రామ్ కుమార్ దని తెలిపారు. అదే విధంగా నేపాల్ సైనిక హెలికాఫ్టర్ కూడా సెర్చ్ ఆపరేషన్ కు పంపినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ చెప్పారు. గల్లంతైన విమానంలో భారతదేశానికి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, వైభవి త్రిపాఠి, రుతికా త్రిపాఠి లు ఉన్నట్లు గుర్తించిన నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం అంధికారులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు.