Flipkart Delivery: ఇటీవల కాలంలో చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడానికి మక్కువ చూపుతున్నారు. ఏం కావాలన్నా చకచకా ఆర్డర్లు పెట్టేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ప్రజలకు వింత అనుభవం ఎదురవుతోంది. ముఖ్యంగా ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకొకటి డెలివరీ అవుతోంది. ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే రాళ్లు, ఇటుకలు వంటివి వస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఖరీదైన వాచ్ను ఆర్డర్ ఇస్తే ఆవు పేడతో చేసిన పిడకలు డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
Flipkart Delivery: వివరాల్లోకి వెళితే
యూపీలోని కౌశాంబిలోని కసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ అనే మహిళ ఇటీవల యాప్లో షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా వాచ్ని ఆర్డర్ చేసింది. దానిని నీలమ్ తన సోదరుడు రవేంద్ర కోసం కొనుగోలు చేసింది. నీలం తన ఆర్డర్ని సెప్టెంబర్ 28న చేసింది. డెలివరీ సమయంలో రూ. 1,304 మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇది తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 7న డెలివరీ వచ్చింది. దానిని ఆమె సోదరుడు రవీంద్ర రిసీవ్ చేసుకున్నాడు. ప్యాకెట్లో అందమైన చేతి గడియారం ఉందని అతను భావించాడు. ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ నుంచి తీసుకుని, దానిని విప్పి చూడగా వారంతా షాక్ అయ్యారు. తన సోదరికి నాలుగు చిన్న ఆవు పేడ కేక్ల ప్యాకెట్ని అందించాడని చూసి అతను షాక్ అయ్యాడు.
తర్వాత ఏమైంది
ఈ అసౌకర్యంతో వారు చాలా ఇబ్బంది పడ్డారు. డెలివరీ బాయ్ని రవీంద్ర పిలిచి, ఫిర్యాదు చేశాడు. తనకు వాచ్ బదులుగా పేడతో చేసిన పిడకలు వచ్చాయని చెప్పాడు. డెలివరీ చేసిన వ్యక్తి డబ్బును తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో, ఐఐఎం-అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ అయిన యశస్వి శర్మ తన తండ్రికి ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు. ‘బిగ్ బిలియన్ డే’ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో ల్యాప్టాప్ను కొనుగోలు చేశాడు. కానీ అతను దానికి బదులుగా ఘాడీ డిటర్జెంట్ అందుకున్న తర్వాత అతను షాక్ అయ్యాడు. ఆన్లైన్ షాపింగ్ ఇలా కస్టమర్లకు చేదు అనుభవాలను మిగుల్చుతున్నాయి.