ఫ్లిప్ కార్ట్ ను అమెరికాకు చెందిన వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్, ఫోన్ పే నెలవారి యాక్టివ్ యూజర్ల సంఖ్య ఆల్ టైం హైక్ చేరుకుందని ఇ-కామర్స్ కంపెనీ వాల్ మార్ట్ తెలిపింది. భారతదేశపు అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్. ఇప్పుడు వాల్ మార్ట్ యాజమాన్యం లో ఫ్లిప్ కార్ట్, ఫోన్ పే ఉన్నాయి. ఫోన్ పే చెల్లింపులపై దృష్టి సారిస్తుండగా, ఫ్లిప్కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో రుణాలు ఇవ్వడం, అమ్మడం, కొనడం వంటివి చేస్తుంది.
మూడవ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపార అమ్మకాలు 1.3శాతం పెరిగి 29.6 చేరినట్లు తెలిపింది.ఈ సంవత్సరం ప్రారంభంలో వాల్ మార్ట్ నిర్వహించిన ఫైనాన్సింగ్ గ్రౌండులో 1.2 బిలియన్ డాలర్లను సేకరించి, ఫ్లిప్కార్ట్ వాల్యూ 24.9 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో నికర అమ్మకాలు 2,19,580 కోట్లుగా ఉన్నాయి. ఇవి 1.3 శాతం పెరిగాయని తెలిపింది. కరెన్సీ రేట్లలో వచ్చిన మార్పులు అమ్మకాలపై నెగిటివ్ ప్రభావం చూపాయని ఒకవేళ కరెన్సీని మినహాయిస్తే నికర అమ్మకాలు2,26,998 కోట్లుగా ఉండేవని కంపెనీ తెలిపింది.ఫ్లిప్కార్ట్ , ఫోన్ పే కాల్ రికార్డు సంఖ్యలో మంత్లీ యాక్టివ్ కస్టమర్లు నమోదు కావడంతో నెట్ సేల్స్ లో మంచి గ్రోత్ రిపోర్ట్ చేశామని వాల్మార్ట్ ప్రకటించింది.
దీంతోపాటు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఫ్లిప్కార్ట్ తన పేమెంట్ యాప్ ఫోన్ పే లకు మంచి గ్రోత్ వచ్చింది. లాక్ డౌన్ సమయం లో భారతీయుల ఫోన్ పే చెల్లింపులు 42% పెరిగాయి. కరోనా సమయంలో ఎక్కువగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రావడంతో ఈ కామర్స్ కంపెనీలు సాధారణంగానే మంచి గ్రోత్ రికార్డు చేశాయి. వాల్ మటుకు ఇప్పటి వరకు లభించిన అతిపెద్ద సముపార్జన నుండి ఆశ్చర్యకరమైన ప్రయోజనం.