భోపాల్: సెల్పీ సరదా వారి ప్రాణం తీసింది. తల్లీ కూతుర్లు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. మహరాష్ట్రలో భారీవర్షాలు, వరద ల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండ్సౌర్ ప్రభుత్వ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆర్డి గుప్తా, ఆయన భార్య బిందు గుప్తా (48), కుమార్తె అశ్రితి (22)లు వారి ఇంటి సమీపంలోని కల్వర్టు వద్ద వరద ఉధృతి చూసేందుకు వెళ్లారు. ఈ సమయంలో గుప్తా భార్య, కుమార్తెలు ఇద్దరూ సెల్ ఫోన్తో సెల్ఫీ తీసుకోవాలని కల్వర్టు మీదకు వెళ్లారు. ఆ సమయంలోనే కల్వర్టు కూలిపోవడంతో వారు వరద నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. తరువాత వరద నీటిలో పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా తల్లి కుమార్తెల మృత దేహాలు లభించినట్లు జిల్లా ఎస్పి హితేష్ చౌదరి తెలిపారు. కొద్ది గంటల తరువాత మండ్సౌర్ అఫ్జల్పూల్ ప్రాంతంలో 50ఏళ్ల బాపులాల్ ధాకాడ్ వరద నీటిలో కొట్టుకుపోయారు.
రాష్ట్ర్లంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా 39మంది మృతి చెందగా, గడచిన 24గంటల్లో ఏడుగురు మరణించారు.
మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎస్పి చౌదరి తెలిపారు.
నర్మద, కశిప్ర, బిట్వ, తపతి, తవ, చంబల్, పార్వతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.