Money: ఇక ఆ వ్యక్తికి వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం గా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షి తో కూడా సంతకం పెట్టించుకోవాలి.
ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటీ అంటే, ఏ వ్యక్తి అయితే డబ్బు తీసుకుంటాడో అతను తన సొంత చేతిరాత తో ప్రామిసరి నోటు రాయాల్సి ఉంటుంది.ఒకవేళ వారికి రాయడం రాకపోతే ఎవరి చేత అయితే రాయించుకుంటారో వారి సంతకం కచ్చితం గా ఉండాలి. కానీ డబ్బు ఇచ్చే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ప్రామిసరి నోటు అస్సలు రాయకూడదు.
ఇక ఎన్ని లక్షలు ఇచ్చిన కూడా లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే మంచిది.5 లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటు రాయించు కోవడం వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది .
డబ్బు మీద తీసుకునే వడ్డీ ప్రభుత్వ కండీషన్స్కు కట్టుబడి ఉండాలి.అలా కాదని అయిదు, పది రూపాయల వడ్డీ ప్రామిసరి నోటు లో రాయించు కుంటే ఆ నోటు కోర్టు లో పనికిరాదు .ప్రామిసరి నోట్లు అయిదు లక్షల నగదు వరకు మాత్రమే వాడటం మంచిది . ఒకవేళ అంతకు మించి డబ్బు ఇవ్వాలిసి వస్తే మాత్రం 100 రూపాయల బాండ్ పేపర్ను వాడటం మంచిది.ఇక డబ్బు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రామిసరి నోటు చేయించుకుంటే మంచిది.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళితే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.ఎలా పడితే అలా రాయించుకుంటే మాత్రం ఆ డబ్బు రావడం కష్టమవుతుంది.కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు నిపుణుల సలహాలు,సూచనలు కూడా తీసుకోండి.. కచ్చితంగా ఈ నియమాలు పాటించి నష్టాలను తగ్గించుకోండి.