Healthy Drinks : పిల్లలకు పొద్దున పూట పాలు త్రాగించి స్కూల్ కు పంపిస్తారు. ఇక మీదట అలా చేయకండి. ఉదయం పాలకు బదులు పండ్లు లేక పండ్ల రసాలు ఇవ్వండి, స్కూల్ కి లంచ్ తో పాటు మజ్జిగ పెట్టండి… రాత్రి అన్నం త్వరగా పెట్టేసి తర్వాత పాలు తాగించి పడుకోబెట్టండి . మీరు కూడా అలానే పాటించండి ఆరోగ్యానికి మంచిది .ఇక పెరుగు ను ఏ సమయం లో తీసుకోవాలో తెలుసుకుందాం .
Healthy Drinks : పాలు, పెరుగు, మజ్జిగ,పళ్లరసాలు వీటిని ఏ సమయంలో తీసుకోవడం వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి !!(పార్ట్-1)
ఆఖరున కొంచెం అన్నం అయినా పెరుగు తో తినకపోతే కొందరికి భోజనం పూర్తి చేసినట్టు అనిపించదు..పెరుగు వలన అటు పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది.పెరుగు లో A, B2, B6, C, E వంటి విటమిన్ మరియు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం,ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు ఇంకా ఆమ్లాలు ఉంటాయి. పెరుగులోని కాల్షియమ్ శరీరానికి పడి D విటమిన్ తయారీకి సహాయపడుతుంది.
పెరుగు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత తినకుండా ఉండడం మంచిది. అది ఆరోగ్యవంతులైన కూడా రాత్రి సమయంలో పెరుగు తీసుకోకూడదు. రాత్రి సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల కఫం పెరుగుతుంది.
అలా రోజూ రాత్రి తీసుకోవడం వల్ల రాను రాను అది ఎలర్జీ, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలకు కారణమవుతుందని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది.పెరుగు తో అరటి పండ్లు రోజూ తినడం మంచిది కాదు.. అప్పుడప్పుడు తినవచ్చు పెరుగు మలబద్దకం, డైహేరియ , మొలలు మరియు పేగులకు సంబందించిన కేన్సర్ వంటి ఇంకా ఎన్నో ఆనారోగ్యాలనుంచి కాపాడుతుంది . ఇంకా పెరుగు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.