Theerdham: ఆచమనం చేసేటప్పుడు
మనం ఇంట్లో లేదా మరెక్కడైనా పూజ చేసేటప్పుడు ఆచమనం చేస్తాము… అలాగే పూజ తర్వాత తీర్థం కూడా తీసుకుంటుంటాము. అయితే ఈ రెండింటికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం.. మనం ఆచమనం చేసేటప్పుడు కేశవ అంటూ 24 నామాలను స్మరిస్తూ ఉంటాము . ఇలా చేసే ఆచమనాన్ని ‘పురాణాచమనం’ ( puranachamanam ) అని అంటారు. దీనితో పాటు కొన్ని ప్రత్యేక ఆచమనాలు కూడా ఉన్నాయి.
Theerdham: కుడిచేతి ఉంగరం వేలికి
అయితే ఆచమనం చేసేటప్పుడు కానీ తీర్థం తీసుకునేటప్పుడు కానీ చప్పుడు అనేది అస్సలు రాకూడదు. మనం చేతిలోకి తీసుకున్న నీరు లేదా తీర్ధం ( theerdham ) కానీ క్రింది పెదవికి తగిలేటట్టుగా మాత్రమేఆచమనం చేయాలి. చేతిలో కి ఒకేసారి నీళ్ళు పోసుకొని మూడుసార్లు తాగితే ఎంగిలి తాగిన దోషం వస్తుంది. మూడు సార్లు కూడా విడివిడిగా నీరుపోసుకొని ఆచమనం చేయాలి. ఆచమించే కుడిచేతి ఉంగరం వేలికి దర్భముడి లేదా బంగారం , వెండి , రాగి, వంటి ఎదో ఒక ఉంగరం పెట్టుకోవాలి. ఇవేమి లేకుండా ఆచమనం చేసిన చప్పుడుయ్యేలా ఆచమనం చేసిన అది రక్తపానంతో సమానంఅవుతుంది అని మరువకూడదు.
వస్త్రాన్ని నాలుగు మడతలుగా
తీర్థం తీసుకునేటప్పుడు వస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టి ఎడమ చేతిలో ఉంచి దానిపైన కుడిచేతిని ఉంచి అప్పుడు తీసుకోవాలి. తీర్ధం క్రింద ఒక్క చుక్క కూడా పడకుండా చూసుకోవాలి. తీర్ధం చిన్న చుక్క కింద పడిన మహాపాతకం అవుతుంది. ఒక్క చెయ్యి చాపి తీర్థం తీసుకోకూడదు. అదేవిధం గా చప్పుడయ్యేలా కూడా తీసుకోకూడదు. పూజ ముగిసిన తర్వాత పూజ చేసినవారు మొదటిగా తీర్థం స్వీకరించి , తరువాత అందరికి పంచాలి . తీర్థం తీసుకున్న తరువాత ఆ చేతిని తలపై రాసుకోకుండా ఒక వస్త్రంతో తుడుచుకోవాలి అని చెప్పబడింది.