Food:రెండు వేరు వేరు రకాల పధార్ధాలతో కలిపి చేసిన వంటకాలుచాల రుచిగా ఉంటాయి. చాలా మంది ఆ కాంబినేషన్ లేకపోతే తినడానిఅసలు ఇష్టపడరు. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో ఎంత ఆరోగ్యమో అంతే ప్రమాదం కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఆహార కాంబినేషన్ తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం ఉండకపోయినా నిమ్మ నెమ్మదిగా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. మరి ఆ విషకర కాంబినేషన్ ఆహార పదార్థాలేమిటోతెలుసుకుందాం…
నిమ్మకాయ, పాలు కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. కడుపులో ఉండే జీర్ణ రసాలలో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. కాబట్టి పాలు, నిమ్మ కలయిక కడుపులో విషంగా మారే ప్రమాదం ఉంది.
పెరుగు తో పండ్లు కలిపితినకూడదు. సిట్రస్ పండ్లు పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియ పై ప్రభావం చూపుతుంది.
మజ్జిగ,అరటిపండు, నల్ల మిరియాలు-చేపలు, పెరుగు-ఖర్జూరాలు, పాలు-మద్యం ఇలాంటి కాంబినేషన్లలోఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి.అరటిపండు, పాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై చెడుప్రభావం ఉంటుంది . అలాగే అరటిపండుని పాలతో తీసుకుంటే జఠరాగ్ని తగ్గిపోతుంది, విషాలు ఉత్పత్తి అవుతాయి. దగ్గు, జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టీ, పెరుగు ఒకేసారి తీసుకోకూడదు. ఈ రెండిట్లో యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యతకోల్పోవడం తో పాటు జీర్ణక్రియపై నాకూడా ప్రభావం చూపుతోంది.పెరుగు,కీరదోస, టమాటాలు, వంటి వాటితో నిమ్మరసం వేసుకోకూడదు .అలా వేసుకుంటే కడుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ సమస్యలు మొదలవుతాయి.