Restaurant: సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు రెస్టారెంట్ కి వెళ్లి తినడాన్ని ఇష్టపడుతుంటారు. అలా కుటుంబం లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చెయ్యడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కొంతమందికి ఆ కాసేపు ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆస్వాదించడం వలన చాలా తృప్తిగా ఉంటుంది.
కానీ, జపాన్ లో ఉన్న రెస్టారెంట్ లలో మాత్రం అలా కుదరదు. జపాన్ దేశం విధించిన నిబంధనల ప్రకారం రెస్టారెంట్ లలో మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజం చెయ్యకూడదట. ఆలా చేస్తే ఏకంగా వారు జైలు శిక్ష విధిస్తున్నారట. తినేటప్పుడు మాట్లాడితే జైలు శిక్ష?? అనుకుంటున్నారా? అవునండి… ఇది నిజం. తినేటప్పుడు మాట్లాడితే కచ్చితంగా జైలు శిక్ష ఉంటుందట. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం..
జపాన్ లోని రెస్టారెంట్ లలో ఈ నిబంధనలను చాలా స్ట్రిక్ట్ గా అమలుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తునందున జపాన్ లో ఈ నిబంధనలను అమలు లోకి తీసుకొచ్చారు. ఇప్పుడిప్పుడే కరోనా వలన మూతపడిన రెస్టారెంట్లు, స్కూల్ లు అన్నీ తిరిగి తెరుచుకుంటున్నాయి. తింటూ మాట్లాడుతున్నప్పుడు కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని జపాన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇక అందుకే జపాన్ ప్రభుత్వం ప్రజలను తినేటప్పుడు మాట్లాడకూడదు అని కొన్ని నిబంధనలను పెట్టింది. అంతేకాకుండా కరోనా ని కట్టడి చేసే పనిలో భాగంగా అక్కడి రెస్టారెంట్ లను రాత్రి 8 గంటలకే మూసివేయాలని జపాన్ ప్రభుత్వం రెస్టారెంట్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా కరోనా కట్టడి లో భాగంగా ఇంకొక కొత్త ఆలోచనతో ముందుకి వచ్చింది జపాన్ లోని క్యోటో నగరం. టోక్యో లో ‘సైలెంట్ ఈటింగ్’ మీద ప్రజలలో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అక్కడి ప్రభుత్వం.