Food ఎంతో ఇష్టం గా మనం తినే కొన్ని ఆహారాల వలన మనకుఅసలు ఎలాంటి ప్రయోజనము ఉండదు. మరి కొన్ని ఆహారాలు మనకి టెన్షన్లు, చికాకు కలిగేలా చేస్తాయి. ఆ ఆహారం గురించి తెలుసుకుందాం..మంచి ఆహారం తీసుకోవడం వలన మన మనసు, శరీరం, మెదడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రకాల ఫుడ్ నోటికి చాల రుచిగా బాగుంటాయికానీ నెమ్మదిగా అవి మనకు హానికలిగేలా చేస్తాయి. అందుకే వైద్య నిపుణులు… అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనిసూచిస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకోవడం వలన లేని పోని టెన్షన్లు, ఒత్తిళ్లూ ఎదుర్కోవలసి ఉంటుందని తెలియచేస్తున్నారు. అవేంటో తెలుసుకొని… ఇప్పటినుంచైనా వాటిని దూరం పెడితే మంచిది కదా…
కేకులు చూస్తే తినకుండా అస్సలు ఉండలేము. కానీ కేకుల్లో పంచదార ఎక్కువగా వేస్తారు అందుకే అవి నోటికి రుచిగా ఉంటాయి కానీ శరీరానికి చాల ప్రమాదం. అవి మనకు తెలియకుండానే శరీరం లో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇలా జరగడం వలన ఎలాంటి ఇబ్బంది ఉంటుందో షుగర్ ఉన్న వారికి తెలుసు. వాళ్లను అడిగితే చెబుతారు అవి తీసుకోవాలో వద్దో.కుదిరినంత వరకు కేకులు, కుకీలు,కూల్ కేక్ లకు దూరంగా ఉండటం మంచిది. ఇక కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే ఇంతకూ ముందు వేసవిలో ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు తాగేస్తున్నారు.
అయితే వాటిలో ఉన్నదంతా కెమికల్స్,కలర్స్, పంచదారే. ఇంకా చెప్పాలంటే 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పే వాటిలో కూడా ఉండే ఫ్రూట్ జ్యూస్ 30 శాతానికి మించదు. మిగతా 70 శాతం పంచదార, కలర్సే ఉంటాయి. ఈ విషయం ఎవ్వరు చెప్పక్కరలేదు. మీరు ఆ ప్యాక్ పై ఉన్న చిన్న అక్షరాల్లో కనిపించే ఇంగ్రిడియంట్స్ చదివితే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఈ స్వీట్ డ్రింక్ మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు… వీటిలో ఫైబర్ తక్కువ కాబట్టి అజీర్తి సమస్యలు వచ్చి లేని పోని టెన్షన్లు కలుగుతాయి.