Food ప్రోటీన్స్ ఉండే ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది అయితే రెస్టారెంట్ లో సెర్వ్ చేసే చాలా ఆహారాలు ఫ్రై చేసి, మాడ్చేసి ఇస్తుంటాయి. అలాంటి వాటిల్లో ప్రోటీన్స్ లేకపోగా అవి క్యాన్సర్ కు కారణమవుతాయి. ఇలాంటివి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి మీలో టెన్షన్, ఆందోళన, ఏదో అయిపోతోందన్న ఫీలింగ్స్ భావన కలిగిస్తాయి.
కాఫీ లాంటివి రోజుకు ఒకటో, రెండో కప్పులు తాగాలి తప్ప రోజుకు నాలుగైదు తాగేయండి. ఎందుకంటే… వాటిలో ఉండే కెఫీన్ అనే పదార్థం ఒక రకమైన మత్తు పదార్థం లాంటిది. అది చాల ప్రమాదకరమైనది. కాఫీ తాగే వాళ్లకు కాఫీ తాగాక… హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ కాఫీ తాగకపోతే… మైండ్ లో ఏదో అయిపోతుంది అన్న భావన కలుగుతుంది. ఆ తల నొప్పి భరించలేక,కాఫీ తాగుతారు. మళ్లీ కెఫైన్ మెదడుకు చేరుతుంది. ఇలా కెఫైన్ బాడీలో పెరిగే కొద్దీ టెన్షన్ కూడా పెరుగుతుంది. ఇది మనలో ఒత్తిడి, ఆదుర్ధా పెరిగేలా చేస్తుంది.
ఇక చివరిగా ఆల్కహాల్ గురించి మాట్లాడుకోవాలంటే… ఈ రోజుల్లో చాలా మంది మద్యం తాగుతూ… అదో మంచి విషయం లా భావిస్తున్నారు. విదేశాల్లో ఉండే మైనస్ డిగ్రీలు తట్టుకునేందుకు అక్కడి వారు మందు తాగుతారు. మన దేశంలో ఇలాంటి వాతావరణం ఉండదు కాబట్టి… మద్యానికి దూరంగా ఉండడమే మంచిది.
మద్యం తాగేవారికి బ్లడ్ షుగర్ లెవల్స్ బాగాపెరుగుతుంటాయి. క్రమంగా ఇన్సోమ్నియా సమస్య వస్తుంది. అంటే నిద్ర పట్టదు.. ఏం చేసినా కూడా నిద్ర రాదు. చివరకు నిద్ర మాత్రల కు అలవాటు పడతారు. అవి ఇంకా ప్రమాదం. అలా కాకుండా ఉండాలంటే మద్యం మానేయడమే మంచిది. దాని బదులు… పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆహారం లోన్ తీసుకుంటూ యోగ ,మెడిటేషన్ వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.