Food మన భోజం పూర్తయిన తరువాత చేయకూడని అయిదు పనుల గురించి తెలుసుకుంటే.. అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణం గా కలుగుతుంది. అన్నపూర్ణా అమ్మ వారి యొక్క అనుగ్రహం పొందితే మనం ఎన్ని కష్టాల్లో, ఎన్ని బాధల్లో,ఎన్ని దరిద్రాలు ఉన్నాకూడా అన్నా నికి లోటు ఎటువంటి లోటు రాదు. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహాన్ని పొందే మార్గం ఏమిటి ?ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అన్నం తిన్న తరువాత ముఖ్యం గా ఈ పనులు చేయకుండా ఉంటే చాలు అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.
1. భోజనం చేసిన తరువాత తిన్నటువంటి ప్లేటులో చేయి కడగకూడదు.ఇలా కడగటం వలన దరిద్రాన్ని కలిగిస్తుంది.కాబట్టి చేతిని బయట కడుక్కోవాలి ప్లేట్ లో మాత్రం కడగకండి.
2. అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో దగ్గు వస్తే అక్కడే కూర్చుని అమ్మకూడదు.ఇది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అని గుర్తు పెట్టుకోండి.
3. భోజనం చేసిన తరువాత చాలా మంది ఒక పిన్ తోనో , లేక టూత్ పిక్ నో తీసుకుని నోటిలోని పళ్ళ మధ్యలో తెగ గుచేస్తూ ఉంటారు. ఇలా అస్సలు గుచ్ఛకూడదు.ఒకవేళ నోటిలో అంతగా ఇబ్బందికరంగాఅనిపిస్తే నీటిని పుక్కిలించాలి. అంతేగాని పళ్ళను గుచ్చడం దరిద్రాన్ని కలిగిస్తుంది అని మరువకండి.
4. భోజనం చేసిన తరువాత చాలామంది కూడా ఒళ్ళంతా బరువుగా ఉందని లేదా మగతగా ఉందని తిన్న ప్లేట్ ప్రక్కనే నడుం వాల్చి పడుకుంటూ ఉంటారు.అలా చేయటం కూడా పరమ దరిద్రన్నీ కలిగిస్తుంది. అలా అసలు చేయకండి.
5. చాల మంది భోజనం చేసి చేతులు కడిగిన తరువాత ఆ చేతుల్ని తుడుచుకో కుండా విదిలిస్తూ ఉంటారు.ఆ నీరు అంతా చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద పదార్ధాల మీద పడుతూ ఉంటాయి.కాబట్టి చేయి కడిగిన తరువాత ఏదైనా వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి తప్ప వదిలించడం వంటివి చేయకూడదు.అలా చేయటం చాలా దరిద్రానికి కారణమవుతుంది.
కాబట్టి భోజనం తర్వాత ఈ పనులు చేయకుండా ఉంటే అన్నపూర్ణ అమ్మ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది.తిండికి ఎటువంటి లోటు ఉండదు.