Drishyam 2 : దృశ్యం 2 కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా .. అవునన్న మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతక ముందు మలయాళ సూపర్ హిట్ సినిమా దృశ్యం తెలుగు రీమేక్ లో నటించాడు వెంకటేష్. తెలుగులో కూడా దృశ్యం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 తెరకెక్కింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. దృశ్యం 2 లో కూడా మోహన్ లాల్ నటించాడు. వాస్తవంగా దృశ్యం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే వెంకీ ని దృశ్యం సీక్వెల్ కూడా నటించమని అభిమానులు కోరారు.
ఆ కోరిక ని వెంకీ తీర్చబోతున్నట్టు తాజా సమాచారం. త్వరలో దృశ్యం 2 ప్రముఖ ఓటిటీ అమెజాన్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. వాస్తవంగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ కారణంగానే వెంకటేష్ దృశ్యం సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపించలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. దృశ్యం సీక్వెల్ లో వెంకీ నటించడాని రెడీ అవుతున్నాడని త్వరలో ఈ సినిమా ప్రకటన రాబోతుందని సమాచారం.
Drishyam 2 : దృశ్యం 2 సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే దృశ్యం సీక్వెల్ సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వసూళ్ల పరంగా దృశ్యం భారీ హిట్ అవడం తో దృశ్యం సీక్వెల్ సినిమా పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదిలో దృశ్యం సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప మే లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా అసురన్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లోకూడా వెంకటేష్ నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది.