health: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి నిపుణులు వివరించారు. వాటి గురించి తెలుసుకుందాం ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల కాలు, పిరుదుల కండరా లు శక్తి హీనంగా మారతాయి. నడవడం తో పాటు స్థిరంగా నిలబడడానికిఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా మారితే వ్యాయామం చేసినా, కిందపడినా తీవ్రమైన దెబ్బలకు కారణం అవుతాయి.రోజులో ఎక్కువ సార్లు కండరాలు కదిలే విధంగా చేయడం వల్ల శరీరంలో కొవ్వు, చక్కెర పూర్తిగా కరిగిపోతాయి. అలా కాక రోజంతా కూర్చుని ఉంటే మాత్రం జీర్ణక్రియ యొక్క వ్యవస్థ బలహీనం గా మారి శరీరంలో కొవ్వు, చక్కెరలు కరగక అలాగే నిల్వ ఉండిపోయి.. గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలకు కారణం అవుతుంది.
అలా గంటలు తరబడి కూర్చుని ఉండిపోవడం వల్ల గర్భాశయం, ఊపిరితిత్తులు,పెద్దప్రేగు క్యాన్సర్ తో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.గంటలు తరబడి కూర్చుని ఉండడం వలన తొడ లో ఉండే కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్ మొదలవుతుంది. ఎక్కువ సేపు కూర్చుని వుండి ఆ తర్వాత కఠినమైన ఎక్సర్సైజ్ లు ఎన్ని చేసిన కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు జీవక్రియ సిండ్రోమ్ వ్యాధి కి కారణం అవుతుంది.
రోజంతా యాక్టివ్ ఉంటే మాత్రం ఈ అనారోగ్య సమస్యలు ఏవి ఇబ్బంది పెట్టావు . కూర్చొని వర్క్ చేసేవారు ప్రతి 30 నిమిషాలకొకసారి లేదా కనీసం గంటకు ఒకసారి అయినా నిల్చోని ఉండడం,అటు ఇటు తిరగడం వంటివి చేస్తుంటే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిలబడి వర్క్ చేసినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. టీవీ చూస్తు, ఫోన్ మాట్లాడుతూ కూడా నడవడం చేస్తుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.