Health: ఈ రోజుల్లో చాలా మందికి కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది.. అలాగే గంటల తరబడి డ్రైవ్ చేయడం వంటి వాటి వల్ల కూడా కొన్ని రోజులు గడిచే సరికి ప్రాణాంతకమైన వ్యాధులు రావడానికి కారణం అవుతుంది అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. ఇలా కదలకుండా ఒకే చోట గంట లు కూర్చోవడానికి,అనారోగ్య సమస్యలు రావడానికి మధ్య సంబంధం ఉందని పరిశోధనలు కూడా తేల్చాయి.
నిల్చోవడం, నడవడం తో పోల్చి చూస్తే కూర్చుని ఉండడం వలన చాలా తక్కువ మొత్తం లో శక్తి ఖర్చు కావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఊబకాయం , రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోవడం, నడుము చుట్టూ బాగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిలు అసమతుల్యత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా గంటల తరబడి ఎక్కువ కాలం కూర్చుని ఉండిపోవడం వల్ల గుండె జబ్బులతో పాటు , క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు దారితీసే కారణాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి అనేక అధ్యయనాలు జరిగాయి అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. అధ్యయనాలలో తేలిన దాని ప్రకారం ఎవరైతే కదలకుండా రోజుకు 8 గంటలకు పైగా కూర్చుని ఉంటున్నారో వారి ప్రాణాలకు చాలా ఎక్కువ ముప్పు వస్తున్నట్టు తేలిందని నిపుణులు తెలియచేస్తున్నారు.
పొగతాగడం , ఊబకాయం వంటి వాటివల్ల ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలు వస్తాయో,రోజుకు 8 గంటల కూర్చోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అని అధ్యయనాల్లో బయట పడింది అని నిపుణులు తెలిపారు. పగటి సమయంలో తక్కువగా కూర్చోవడం, పడుకోవడం వంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలియ చేస్తున్నారు.