కెన్యాలోని గారిస్సా కౌంటీలోని కన్జర్వెన్సీ నుండి తల్లి ,ఆమె దూడ కెమెరాలో చిక్కిన తరువాత, తెల్ల జిరాఫీలు ఉన్నట్లు అందరికి తెలిసింది. అయితే ఇది తెలుసుకున్న వేటగాళ్లు చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సంవత్సరం తరువాత, కెన్యాలోని గారిస్సా కౌంటీలోని ఒక గ్రామంలో రేంజర్స్ ఆడ, ఆమె దూడ యొక్క మృతదేహాలను అటవీ అధికారులు కనుగొన్నారు. మూడవ తెల్ల జిరాఫీ ఇంకా సజీవంగా ఉంది. ఇది ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైకదిగా భావిస్తున్నారు, పరిరక్షణాధికారులు తెలిపారు.వాటి తెల్లటి రూపానికి కారణం లూసిజం అనే అరుదైన జన్యు లక్షణం, దీనివల్ల చర్మ కణాలకు పిగ్మెంటేషన్ ఉండదు.
ఈ జన్యు లక్షణం కలిగిన మగ జిరాఫీ కెన్యాలోని ఇషాక్బిని కమ్యూనిటీ కన్సర్వేన్సీలో సంచరిస్తోంది. భూమి మీద మిగిలిన చివరి శ్వేతా జిరాఫీ ఇదే అవ్వొచ్చని భావిస్తున్నారు.దీంతో ఈ జీవిని వేటగాళ్ల బారిన పడకుండా అటవీ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు.అందులో భాగంగా దాని కొమ్ములకు జీపీఎస్ అమర్చారు.దీనిద్వారా ప్రతి గంటకొకసారి దానికి సంబంధించిన సమాచారం వారి తెలుస్తుంది. జిరాఫీ ఆచూకీపై ట్రాకింగ్ పరికరం గంటకు నవీకరణలను ఇస్తుందని, రేంజర్స్ “ప్రత్యేకమైన జంతువును వేటగాళ్ళ నుండి సురక్షితంగా ఉంచడానికి” వీలు కల్పిస్తుందని చెప్పారు.