కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచీ,మన చుట్టూ పక్కల తుమ్మేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది.ఇంతకు ముందులా ప్రశాంతంగా,పెద్దగా అరుస్తూ హాయిగా తుమ్మేవాళ్లే కనిపించట్లేదు. తుమ్మితే,చుట్టుపక్కల వాళ్లు… ఎక్కడ కరోనా వచ్చిందని అనుకుంటారో అని చాలా మంది తుమ్మడమే మానుకున్నారు. ఒకవేళ తుమ్ము వచ్చిన బలవంతంగా ఆపేసుకుంటున్నారు.
ముక్కును మూసేసుకొని, వేగంగా గాలి పీల్చుతూ, వదిలేస్తూ ఏదో ఒకటి చేసి తుమ్మునుఆపుకుంటున్నారు. హమ్మయ్య… తుమ్మలేదు… చుట్టూ ఎవరూ ఏమీ అనుకోవట్లేదులే అని సరిపెట్టుకుంటున్నారు.. కానీ తుమ్ము వచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదంటున్నారు డాక్టర్లు. తుమ్ము వస్తే, కర్చీఫ్ లేదా మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలే తప్ప, అసలు తుమ్మడాన్ని బలవంతంగా ఆపితే దాని వలన మరింత ప్రమాదం వస్తుంది అంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
తుమ్ము వస్తే మాత్రం ఆపుకోకుండా తుమ్మాల్సిందే. అయితే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి,చుట్టూ జనాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తుమ్మొచ్చు అంటున్నారు డాక్టర్లు.తుమ్మును బలవంతంగా ఆపడం వలన చెవిలోని డయాఫ్రమ్ దెబ్బతిని చెముడు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే కంట్లోని రక్త నాళాలు కూడా దెబ్బతింటాయి. కంట్లోని తెల్ల పొరపై ఐరిస్ చుట్టూ రక్తనాళాలు బ్రేక్ అవుతాయి కూడా.
బ్రెయిన్లోని రక్త నాళాలు బలహీనంగా మారిపోతాయి… మన శరీరంలో ఏదైనా అవసరం లేనిది బాడీలోకి వస్తే… బాడీ దాన్ని తుమ్ము ద్వారా బయటకు పంపేస్తుంది. ముక్కులో ఏదైనా సూక్ష్మక్రిమి, లేదా చెడు వాసన తో బ్యాక్టీరియా ముక్కు లోకి వెళ్తే ముక్కు దాన్ని తుమ్మడం ద్వారా బయటకు పంపేస్తుంది. తుమ్మును ఆపేస్తే ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ ముక్కులో నే ఉండిపోతుంది. కాసేపటి తర్వాత అయినా మళ్లీ దాన్ని బయటకు పంపేందుకు ముక్కు ప్రయత్నిస్తుంది.
తుమ్మును ఆపితే… ఆ తర్వాత వచ్చే తుమ్ము మరింత బలంగా వస్తుంది.సైనస్ సర్జరీ చేయించుకున్న వారు తుమ్ములను అస్సలు పాపుకోకూడదు. అలా చేస్తే, వీపరీతమైన తలనొప్పి, ఒక్కో సారి గుండె జబ్బు కూడా రావచ్చంటు హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.