కొందరికీ ఏదైనా నా త్వరగా గుర్తుకొస్తుంది. మరికొందరికి మననం చేసుకున్న కానీ గుర్తుకు రాదు. ఈ సమస్య ఉన్న వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్టు లేదంటే మతిమరుపు. ఈ రోజు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత లేకపోవడం. ఇక విద్యార్థులకైతే చదివింది అసలు గుర్తుండకపోవడం. అంతేకాకుండా పెద్ద వారికి కూడా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య వస్తుంది.
మనిషి మొత్తం బరువు లో మెదడు బరువు కేవలం రెండు శాతం మాత్రమే. కానీ గుండె నుంచి చేరే రక్తం మాత్రం 15 శాతం వెళుతుంది. అలాగే మనం పీల్చే గాలిలో 20 శాతం ఖచ్చితంగా దీనికి చేరాల్సిందే. అంతేకాకుండా మన కోసం తయారయ్యే శక్తిలో ఐదో వంతు ను వినియోగిస్తుంది. పెద్ద మొత్తంలో రక్తం, ఆక్సిజన్ ఎందుకు తీసుకుంటుందంటే మన బరువు ప్రకారం చూసుకుంటే చిన్నదైనప్పటికీ అది నిర్వహించే పనులు చాల పెద్దవి. అందుకే మన ఆహారంలో లో కొంత భాగాన్ని అది డిమాండ్ చేస్తుంది. ఇది దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెదడుకు అల్జీమర్స్ వస్తూ ఉంటాయి. అంటే నాడుల మధ్య సమాచారం ప్రసారం కావడానికి మెదడులో కొన్ని రసాయనాలు తయారవుతూ ఉంటాయి. మెదడు పనితీరు బాగుండాలంటే సక్రమంగా పని చేయాలంటే ఈ రసాయనాల పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే వీటి మోతాదులో తేడాలు ఏర్పడితే మెదడు పనితీరులో సమస్యలు వస్తాయి.
ఇవి ఆహారంలో భాగంగా తీసుకోవాలి :
- యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉపయోగపడతాయి.మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
- రోజు గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును తీసుకుంటే అందంతో పాటు మెదడును కూడా వేగంగా పనిచేస్తుంది.ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఇతర సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకుంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది.
- ఆరోగ్యానికి ఇవి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే వాల్ నట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. గుప్పెడు వాల్ నట్స్ కనుక ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుకుగా పని చేయాలన్నా, పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడాలిన్న వాల్ నట్స్ తింటే సరిపోతుంది.
- గుప్పెడు ఎండు ద్రాక్ష కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో బోరాన్ వుండటం వలన ఇది మన మెమరీ పవర్ ను బాగా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు ఎండు ద్రాక్షను పిల్లలకు ఇస్తే ఫలితాన్ని మీరు చూడవచ్చు.
వంటింట్లోని కొన్ని చిట్కాలు :
- క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలవబడే మిరియాలను ఆరోగ్యానికే కాదు మెదడు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ ఆక్సిడెంట్ బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెదడును చురుగ్గా చేసి జ్ఞాపకశక్తి వృద్ధి చేస్తుంది.
- భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా సోంపు తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. దీనిలో జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన మెదడు చురుగ్గా చేస్తాయి పనిచేస్తాయి.
- సోంపు, బాదంపప్పు, కండచక్కెర ను ఈ మూడింటినీ కలిపి పొడి చేసుకుని వేడిపాలలో కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేయటాన్ని స్వయంగా మీరే చూస్తారు. అంతేకాకుండా డా రక్తం వృద్ధి అవుతుంది. బీపీ తగ్గుతుంది.