83 : సాధారణంగా బయోపిక్ సినిమా అంటే మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. భారీగా బడ్జెట్ కేటాయించి వాస్తవ సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తారు. దంగల్, సూపర్ 30, ప్యాడ్ మ్యాన్, సైనా, గంగూబాయి, డర్టీ పిక్చర్..ఇలా బాలీవుడ్లో వరుసగా క్రేజీ బయోపిక్స్ని తెరమీదకి తీసుకు వస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ వీటికి మంచి ఆదరణ
లభిస్తుంది. మామూలు కమర్షియల్ సినిమాలకంటే గత కొంతకాలంగా బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనూ ఎన్.టి.ఆర్ సినీ, రాజకీయ విశేషాలను రెండు భాగాలుగా రూపొందించారు. వీటిలో ఆయన తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించారు.
ఇదే బయోపిక్ని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని లక్ష్మీ పార్వతీ వైపు నుంచి ఆసక్తికరమైన అంశాలను చూపించాడు. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాను తీశాడు. కీర్తిసురేష్ ఇందులో టైటిల్ రోల్ పోషించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మ బయోపిక్గా తలైవి రూపొందించారు. ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే బాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ బయోపిక్ 83. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు.
83 : 83 సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ మేకర్స్ నుంచి రావడం లేదు.
అయితే ఎప్పుడో ఏడాది క్రితమే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కరోనా ఫస్ట్ వేవ్ వల్ల బ్రేక్ పడింది. ఫస్ట్ లాక్ డౌన్ ముగియగానే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ మళ్ళీ ఆగిపోయారు. ఇందుకు కారణం 83 ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలా, లేక ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే డైమాలో కూడా ఉన్నారు. ఈలోపు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో ఈ మధ్య 83 సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ మేకర్స్ నుంచి రావడం లేదు. తెలుగులో కూడా ఈ సినిమాను నాగార్జున రిలీజ్ చేయనున్నారు. కానీ ఎక్కడా దీనికి సంబంధించిన వార్తలు రాకపోవడంతో అందరూ ఈ సినిమాను మర్చిపోయినట్టేనా అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి త్వరలో అప్డేట్ వస్తుందేమో. ఇక టైటిల్లో రన్వీర్ సింగ్, ఆయనకి భార్యగా దీపిక పదుకొణ్ నటిస్తున్నారు.