(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా మాజీ ఆర్థిక కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ కుమార్ నియమితులైయ్యారు. రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్షపదవికి ఆయన ఆగస్టులో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఎన్నికల కమిషనర్ అశోక లవాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియమితులైయ్యారు.
రాజీవ్ కుమార్ ఏప్రిల్ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేయగా ఆయనను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఆసియా అభివృద్ధి బ్యాంక్ చైర్మన్ గా నియమించింది. రాజీవ్ కుమార్ 1984 జార్ఖండ్ కేడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి.