ఢిల్లీ, జనవరి 16: న్యాయమూర్తుల పదోన్నతులపై కొలిజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంభీర్ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు లేఖ రాశారు. జనవరి పదవ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజియం కర్నాటక ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మల్లేశ్వరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాలకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతికి సిఫార్సు చేసింది. వీరి పదోన్నతుల నిర్ణయాలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
previous post
next post