హైదరాబాదు, ఫిబ్రవరి 5: కడప జిల్లాకు చెందిన టిడిపి మాజీ మంత్రి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఖలీల్ బాషా మంగళవారం వైసిపిలో చేరారు.
లోటస్ పాండ్లో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖలీల్ బాషాకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వనించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు