అమరావతి,మార్చి 5 : ఆంధ్ర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, మాడుగుల మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు అమరావతిలో ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు.
కర్రి సీతారాం, పూడి మంగపతిరావులను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలు వెంటబెట్టుకొచ్చారు. టిడిపిలో చేరేందుకు వీరద్దరూ ఆసక్తి చూపడంతో చంద్రబాబు అనుకూలంగా స్పందించారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీతారాం, మంగపతిరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.