కరోనా వైరస్ రోజురోజుకూ అన్ని చోట్లా వ్యాపిస్తోంది. వాళ్ళూ వీళ్లూ అని లేకుండా అందరూ ఈ భయానక వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెల్సిందే.
తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డ్రైవర్ గా పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కవిత మరియు తన కుటుంబం మొత్తాన్ని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు తెలిపారు. వారం నుండి పది రోజుల పాటు కవిత కుటుంబం ఇంటికే పరిమితం కానున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ ప్రాబల్యం పెరుగుతోంది. రోజుకు సగటున 1200పైన కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.