ఇటీవల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పల్నాటి ప్రాంతానికి చెందిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డిబెట్ లో పాల్గొనడం జరిగింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చాలెంజ్ లు చేశారు. 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ది ఆ ప్రాంతం కాదని, వారానికి ఒకసారి వచ్చి వెళ్లే నాయకుడు అని ఆయన పై సెటైర్లు వేశారు. అంతమాత్రమే కాకుండా నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదు అన్నట్టు కామెంట్లు చేశారు. ఏది ఏమైనా పల్నాటి ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి మళ్లీ జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి తరఫున పోటీ చేస్తానని యరపతినేని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
కచ్చితంగా గెలుస్తా..కాసు మహేష్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకుని గ్యారెంటీ అని తెలిపారు. ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ఎరపతినేని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా పలనాటి ప్రాంతం తన ప్రాంతం కాకపోయినా గానీ పల్నాటి పై ప్రేమ ఉందని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో కూడా ఎరపతినేని నిలబడితే ఖచ్చితంగా గెలుపు మరింత ఈజీ అవుతుందని.. ఎరపతినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు.