Breaking: ఏపి – కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. పంట కోతల కోసం వెళ్లిన కూలీలు విద్యుతాఘాతంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తొంది. బొమ్మనహళ్ మండలం దర్గహొన్నూర్ లో ఈ ఘోరం జరిగింది. క్షతగాత్రులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాాచారం.
ట్రాక్టర్ పై వచ్చిన కూలీలు విద్యుతాఘాతంలో మృతి చెందడంతో ఇతర కూలీలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వికేంద్రీకరణకు మద్దతుగా ఆముదాలవలసలో రౌండ్ టేబుల్ సమావేశాలు .. నరసన్నపేటలో భారీ ర్యాలీ