ఆంధ్రప్రదేశ్ లో శానిటైజర్ తాగి మరణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే రెండు, మూడు శానిటైజర్ మరణాల సంఘటనలు నమోదైన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు తిరుపతిలోని స్కేవెంజెర్ కాలనీకి చెందిన పారిశుధ్య కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులు మందు దొరక్క శానిటైజర్ తాగి మృతి చెందారు.
దీంతో స్కేవెంజర్ కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో కురిచేడు, పామూరులో ఏకంగా 16 మంది శానిటైజర్ తాగి మృతి చెందిన విషయం తెల్సిందే. కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయారు. ఇలా వరస శానిటైజర్ మరణాలు జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మందుల ధరలు పెరిగిపోవడంతో అవి కొనలేక శానిటైజర్ లను తాగుతున్నట్లుగా తెలుస్తోంది.